డిప్యూటీ సీఎం సిసోడియాకు ప్లాస్మా థెరపీ

ABN , First Publish Date - 2020-09-26T13:25:53+05:30 IST

కరోనా, డెంగీల బారిన పడిన ఢిల్లీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు వైద్యులు ప్లాస్మా థెరపీ చేశారు.

డిప్యూటీ సీఎం సిసోడియాకు ప్లాస్మా థెరపీ

న్యూఢిల్లీ : కరోనా, డెంగీల బారిన పడిన ఢిల్లీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు వైద్యులు ప్లాస్మా థెరపీ చేశారు.కరోనాతో ఢిల్లీలోని లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డెంగీ బారిన పడిన సిసోడియాను సాకేత్ లోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించారు. జ్వరంతో పాటు రక్తం ఆక్సిజన్ లెవెల్ తగ్గడంతో సిసోడియాకు వైద్యులు ప్లాస్మాథెరపీ చేశారు.కరోనా సోకిన 48 ఏళ్ల సిసోడియాకు బీపీ సమస్యతో బాధ పడుతున్నారు.సిసోడియాకు డెంగీ సోకి జ్వరంతో పాటు ప్లేట్ లెట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో అతన్ని మెరుగైన చికిత్స కోసం సాకేత్‌లోని మ్యాక్సు ఆసుపత్రికి తరలించారు.


సెప్టెంబరు 14వతేదీన సిసోడియాకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ముందుగా హోం ఐసోలేషన్ లో ఉన్నా, లక్షణాలు కనిపించడంతో ఎల్ఎన్ జేపీ ఆసుపత్రిలో చేరారు.సిసోడియాకు ఆక్సిజన్ పెట్టి ఐసీయూలో చేర్చామని వైద్యులు చెప్పారు. ఢిల్లీలో ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ తోపాటు డిప్యూటీ సీఎం సిసోడియాలకు కరోనా సోకడంతో వారు అసెంబ్లీ సమావేశానికి హాజరు కాలేదు.

Updated Date - 2020-09-26T13:25:53+05:30 IST