రావణ దహనం చూసి తీరాల్సిందే!
ABN , First Publish Date - 2021-10-09T06:09:28+05:30 IST
దేశ రాజధాని ఢిల్లీలో దసరా వేడుకలు ఘనంగా జరుపుకొంటారు. ఆలయాలను సుందరంగా అలంకరిస్తారు.
దేశ రాజధాని ఢిల్లీలో దసరా వేడుకలు ఘనంగా జరుపుకొంటారు. ఆలయాలను సుందరంగా అలంకరిస్తారు. ఇక రామ్లీలా మైదానంలో జరిగే వేడుకలు చూసి తీరాల్సిందే. వేల మంది ప్రజలు ఈ వేడుకలు చూసేందుకు వస్తుంటారు. అతి పెద్ద రావణుడి బొమ్మ తయారుచేసి రావణ దహనం కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల వేళ ప్రజలు తొమ్మిది రోజుల పాటు ఉపవాసాలు ఉంటారు. రామ్లీలా నాటకం చూడటం మధురానుభూతిని పంచుతుంది. అక్కడక్కడా దుర్గామాత మండపాలు ఏర్పాటు చేస్తారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ దసరా ఉత్సవాలను ఉత్సాహంగా జరుపుకొంటారు.