9 ఏళ్ల చిన్నారిపై దారుణం.. నిందితులకు పోలీస్ కస్టడీ
ABN , First Publish Date - 2021-08-10T08:07:30+05:30 IST
దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 9ఏళ్ల చిన్నారిపై మానవ మృగాలు దాడి చేసి బలాత్కరించి, ఆ తర్వాత..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 9ఏళ్ల చిన్నారిపై మానవ మృగాలు దాడి చేసి బలాత్కరించి, ఆ తర్వాత ఊపిరి తీసిన పైశాచిక ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు నలుగురు నిందితులను 3 రోజులు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ తీర్పునిచ్చింది. నిందితులలో 55 ఏళ్ల రాధేశ్యామ్ అనే పూజారి కూడా ఉండడం శోచనీయం.
గత నెల జరిగిన ఈ ఘటనలో రాధేశ్యామ్తో పాటు సలీమ్, లక్ష్మీ నారాయణ్, కుల్దీప్ అనే వారు 9ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి చంపి ఆ తర్వాత పూడ్చిపెట్టేశారు. నిందితులంతా మరణించిన చిన్నారి తల్లికి పరిచయస్తులు కావడం గమనార్హం. నిందితులను విచారించేందుకు 5 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోరడంతో.. విచారించిన ధర్మాసనం 3 రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.