అయ్యర్ను వదిలేసిన ఢిల్లీ
ABN , First Publish Date - 2021-11-26T10:14:20+05:30 IST
తాము అట్టిపెట్టుకొనే క్రికెటర్లపై ఢిల్లీ క్యాపిటల్స్ తుది నిర్ణయానికి వచ్చింది. కెప్టెన్ పంత్తోపాటు పృథ్వీ షా, అక్షర్ పటేల్, పేసర్ నోకియాను రిటైన్ చేసుకోనుంది.
న్యూఢిల్లీ: తాము అట్టిపెట్టుకొనే క్రికెటర్లపై ఢిల్లీ క్యాపిటల్స్ తుది నిర్ణయానికి వచ్చింది. కెప్టెన్ పంత్తోపాటు పృథ్వీ షా, అక్షర్ పటేల్, పేసర్ నోకియాను రిటైన్ చేసుకోనుంది. సారథిగా వ్యవహ రించిన శ్రేయాస్ అయ్యర్ను వదిలేసుకోవాలని నిర్ణయించుకుంది. దాంతో అయ్యర్తోపాటు సీనియర్ ధవన్ కూడా వేలంలోకి వెళ్లాల్సి వస్తోంది. కాగా.. ధోనీని మరో మూడేళ్లపాటు అట్టిపెట్టుకో వాలని చెన్నై సూపర్కింగ్స్ నిర్ణయించుకున్నట్టు సమాచారం.