ఢిల్లీలో పోలీసు కానిస్టేబుల్ ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-07-17T11:01:03+05:30 IST

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో ఓ పోలీసు కానిస్టేబుల్ ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన జరిగింది.....

ఢిల్లీలో పోలీసు కానిస్టేబుల్ ఆత్మహత్య

ఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో ఓ పోలీసు కానిస్టేబుల్ ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాగ్ పత్ పట్టణానికి చెందిన పరీక్షిత్ (25) పోలీసుకానిస్టేబుల్ గా 2018 నుంచి పనిచేస్తున్నాడు. పరీక్షిత్ బురారీ లక్ష్మీనగర్ ప్రాంతానికి చెందిన మీనాక్షిని ఫిబ్రవరి నెలలో వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం పరీక్షిత్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది. పరీక్షిత్ వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. పోలీసులు పరీక్షిత్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో కానిస్టేబుల్ భార్య మీనాక్షిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 

Updated Date - 2020-07-17T11:01:03+05:30 IST