ఢిల్లీలో కార్మికులకు డీఏ పెంపు...

ABN , First Publish Date - 2020-12-05T14:56:24+05:30 IST

ఢిల్లీలో కార్మికులకు సర్కారు శుభవార్త వెల్లడించింది. నైపుణ్యం లేని, సెమీ స్కిల్డు, స్కిల్డు, ఇతర కేటగిరి కార్మికులకు రోజువారీ భత్యం పెంచుతున్నట్లు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వెల్లడించారు.....

ఢిల్లీలో కార్మికులకు డీఏ పెంపు...

సర్కారు నిర్ణయం

న్యూఢిల్లీ : ఢిల్లీలో కార్మికులకు సర్కారు శుభవార్త వెల్లడించింది. నైపుణ్యం లేని, సెమీ స్కిల్డు, స్కిల్డు, ఇతర కేటగిరి కార్మికులకు రోజువారీ భత్యం పెంచుతున్నట్లు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వెల్లడించారు. కరోనా వైరస్ సంక్షోభం సమయంలో కార్మికులకు వేతనాలు సకాలంలో అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని సిసోడియా చెప్పారు. సవరించిన కనీస వేతనాలు, డీఏ అక్టోబరు 1వతేదీ నుంచి ఇస్తామని ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది. నైపుణ్యం లేని కార్మికులకు రూ.15,492 , రోజువారీ 596 రూపాయలు, పాక్షిక నైపుణ్యం ఉన్న కార్మికులకు రూ.17,069, రోజువారీ 657 రూపాయలు, నైపుణ్యం కల కార్మికులకు రూ.18,797, రోజువారీ 723 రూపాయలుగా నిర్ణయించారు.

Updated Date - 2020-12-05T14:56:24+05:30 IST