ఢిల్లీలో 213 కొత్త కోవిడ్ కేసులు, పాజిటివిటీ రేటు 0.30 శాతం

ABN , First Publish Date - 2021-06-13T01:25:37+05:30 IST

ఢిల్లీలో 213 కొత్త కోవిడ్ కేసులు, పాజిటివిటీ రేటు 0.30 శాతం

ఢిల్లీలో 213 కొత్త కోవిడ్ కేసులు, పాజిటివిటీ రేటు 0.30 శాతం

న్యూఢిల్లీ: కరోనా వైరస్ నియంత్రణకు ఢిల్లీ సర్కారు కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ చర్యలతో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో శనివారం రోజు కొత్తగా 213 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇది మూడు నెలల్లో అతి తక్కువ రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య అని ప్రభుత్వం వెల్లడించింది. ఢిల్లీలో శనివారం రోజువారీ కోవిడ్-19 పాజిటివిటీ రేటు 0.30 శాతానికి పడిపోయిందని వైద్య అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో 497 కోవిడ్ -19 రికవరీలు నమోదు కాగా, మరో 28 కోవిడ్ -19 సంబంధిత మరణాలు కూడా నమోదయ్యాయని ఢిల్లీ సర్కారు పేర్కొంది.

Updated Date - 2021-06-13T01:25:37+05:30 IST