ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు

ABN , First Publish Date - 2020-10-30T02:47:22+05:30 IST

ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు

ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు

న్యూఢిల్లీ: ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఢిల్లీలో గురువారం రోజు కనిష్ట ఉష్ణోగ్రత 12.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.


ఇది 26 సంవత్సరాలలో అక్టోబర్‌లో కనిష్ట ఉష్ణోగ్రత అని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. సంవత్సరంలో ఈ సమయంలో సాధారణ కనిష్ట ఉష్ణోగ్రత 15 నుంచి 16 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఐఎండీ గణాంకాల ప్రకారం 1994 అక్టోబర్ 31న ఢిల్లీలో కనిష్టంగా 12.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.

Updated Date - 2020-10-30T02:47:22+05:30 IST