ఢిల్లీలో తగ్గని కరోనా ఉధృతి.. ఇవాళ ఒక్కరోజే...

ABN , First Publish Date - 2020-07-10T04:48:09+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఇవాళ ఒక్కరోజే ఇక్కడ 2,187 పాజిటివ్ కేసులు..

ఢిల్లీలో తగ్గని కరోనా ఉధృతి.. ఇవాళ ఒక్కరోజే...

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఇవాళ ఒక్కరోజే ఇక్కడ 2,187 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 45 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఢిల్లీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,07,051కి పెరిగినట్టు అధికారులు వెల్లడించారు. ఇందులో 82,226 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు మొత్తం కరోనా మరణాల సంఖ్య 3,258కి చేరింది. ప్రస్తుతం దేశ రాజధానిలో 21,567 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.


మరోవైపు దేశవ్యాప్తంగా ఇవాళ రికార్డు స్థాయిలో కొత్తగా 24,879 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 487 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు దేశంలో కొవిడ్-19 కేసుల సంఖ్య 7,67,296కు చేరింది. ప్రస్తుతం 2,69,789 యాక్టివ్ కేసులు ఉండగా.. 4,76,378 మంది కోలుకున్నారు. ఈ మహమ్మారి కారణంగా దేశంలో ఇప్పటి వరకు 21,129 మంది మృత్యువాత పడ్డారు. 

Updated Date - 2020-07-10T04:48:09+05:30 IST