బాలిక టెర్రస్‌పై శిశువుకు జన్మనిచ్చి..శిశువును వదిలేసి...

ABN , First Publish Date - 2020-11-05T17:22:50+05:30 IST

అరవై ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేయడంతో గర్భం దాల్చిన 16 ఏళ్ల బాలిక టెర్రస్ పై పండంటి బిడ్డకు జన్మనిచ్చి వదిలేసిస దారుణ ఘటన....

బాలిక టెర్రస్‌పై శిశువుకు జన్మనిచ్చి..శిశువును వదిలేసి...

న్యూఢిల్లీ : అరవై ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేయడంతో గర్భం దాల్చిన 16 ఏళ్ల బాలిక టెర్రస్ పై పండంటి బిడ్డకు జన్మనిచ్చి వదిలేసిస దారుణ ఘటన ఢిల్లీలో వెలుగుచూసింది. వస్త్రంలో చుట్టి ఉన్న నవజాత శిశువు టెర్రస్ పై ఉందని ఢిల్లీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు టెర్రస్ వద్దకు వచ్చి నవజాత శిశువును ఆసుపత్రికి తరలించారు.అనంతరం ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించగా శిశువుతో ఒక బాలిక కనిపించిందని సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. 9 నెలల క్రితం తనపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేశాడని, తాను గర్భం దాల్చిన విషయం తల్లికి  చెప్పేందుకు భయపడి టెర్రస్ పై ప్రసవించి శిశువును వదిలివేశానని ఓ బాలిక పోలీసులకు చెప్పింది. బాలిక తల్లి పనిమనిషిగా పనిచేస్తుందని పోలీసులు చెప్పారు. బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. 

Updated Date - 2020-11-05T17:22:50+05:30 IST