Delhiనే టాప్.. America, UK, Chinaలు కూడా దిగదుడుపే..

ABN , First Publish Date - 2021-08-28T13:47:22+05:30 IST

భారత్‌కు గర్వకారణమైన విషయం ఇది. ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన అమెరికా, ఇంగ్లండ్, చైనాలను కూడా భారత్ అధిగమించిన అంశం ఇది. ఆయా దేశాల్లోని టాప్..

Delhiనే టాప్.. America, UK, Chinaలు కూడా దిగదుడుపే..

న్యూఢిల్లీ: భారత్‌కు గర్వకారణమైన విషయం ఇది. ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన అమెరికా, ఇంగ్లండ్, చైనాలను కూడా భారత్ అధిగమించిన అంశం ఇది. ఆయా దేశాల్లోని టాప్ నగరాలకంటే భారతదేశ రాజధాని ఢిల్లీ నగరం ముందంజలో నిలిచింది. ఇంతకీ ఏ విషయంలో అని ఆలోచిస్తున్నారా..? సీసీ కెమెరాల ఏర్పాటులో. అవును మీరు వింటున్నది నిజమే. టెక్నాలజీలో భారత్‌కంటే ఎంతగానో అభివృద్ధి చెందిన అగ్ర దేశాలలోని షాంఘై, న్యూయార్క్, లండన్ వంటి నగరాలను సైతం వెనక్కి నెడుతూ.. బహిరంగ ప్రదేశాల్లో సీసీ కెమెరాల ఏర్పాటులో భారత రాజధాని ఢిల్లీ నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించడం కొంత ఆశ్చర్యం కలిగించే అంశమే. అయితే ఈ విషయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా వెల్లడించారు. దీనికి సంబంధించి ఫోర్బ్స్ ఇండియాను ప్రాతిపదికగా ఆయన చూపించారు.


కాగా.. ఢిల్లీలో మొత్తం 2.8 లక్షల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ టార్గెట్ పెట్టుకుంది. ఈ బాధ్యతను పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్(పీడబ్య్లూడీ)కి అప్పగించింది. ఈ ప్రక్రియ మొత్తం రెండు దశలుగా జరగనుంది. పీడబ్య్లూడీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 2019 డిసెంబర్ నాటికే ఒక లక్ష ఐదు వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం పూర్తయింది.


ఇదిలా ఉంటే ఢిల్లీ టాప్‌లో, లండన్ రెండో స్థానంలో ఉండగా మూడో స్థానం మళ్లీ దక్షిణ భారతదేశానికి దక్కింది. తమిళనాడు రాజధాని చెన్నైలో ప్రతి చదరవు మైలుకు 609 సీసీ కెమెరాలు ఏర్పాటై ఉన్నాయి. అయితే భారత్‌లోనే ఎంతగానో అభివృద్ది చెందిన నగరంగా, ఆర్థిక రాజధానిగా పేరు పొందిన ముంబై మాత్రం ఈ లిస్ట్‌లో 18వ స్థానంలో ఉండడం గమనార్హం. 


దీనికోసం కృషి చేసిన ఢిల్లీ అధికారులను సైతం ఆయన అభినందించారు. ‘గర్వంగా ఉంది. బహిరంగ ప్రదేశాల్లో సీసీ కెమెరాల ఏర్పాటులో షాంఘై, న్యూయార్క్, లండన్ వంటి అభివృద్ధి చెందిన నగరాలను సైతం ఈ విషయంలో ఢిల్లీ వెనక్కి నెట్టింది. ఢిల్లీలో ప్రస్తుతం చదరపు మైలు(రెండున్న కిలోమీటరు)కు 1826 సీసీ కెమెరాలు ఏర్పాటై ఉన్నాయి. అదే లండన్‌లో 1138, మిగిలిన చోట్ల అంతకంటే తక్కువ ఉన్నాయి. అతి తక్కువ సమయంలో శరవేగంగా కృషి చేసి ఈ ఘనత సాధించినందుకు ఇంజనీర్లకు, అధికారులకు ప్రత్యేక అభినందనలు’ అని కేజ్రీవాల్ తాజా సందేశంలో పేర్కొన్నారు. 

Updated Date - 2021-08-28T13:47:22+05:30 IST