ఢిల్లీకి తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు
ABN , First Publish Date - 2021-12-20T02:12:52+05:30 IST
తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్షాతో బీజేపీ నేతలు భేటీ కానున్నారు. తెలంగాణలో..
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్షాతో బీజేపీ నేతలు భేటీ కానున్నారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, కేంద్రంపై కేసీఆర్ వ్యాఖ్యలను కమలనాథులు అమిత్షా దృష్టికి తీసుకెళ్లనున్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత పాదయాత్రపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.