కామన్వెల్త్ గేమ్స్ స్టేడియంలో కోవిడ్ కేర్ సెంటర్
ABN , First Publish Date - 2020-07-02T16:29:47+05:30 IST
దేశరాజధాని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ నేపధ్యంలో బాధితుల కోసం ఢిల్లీలోని కామన్వెల్త్ గేమ్స్ స్టేడియంలో 600 పడకలతో కోవిడ్-19 సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ నేపధ్యంలో బాధితుల కోసం ఢిల్లీలోని కామన్వెల్త్ గేమ్స్ స్టేడియంలో 600 పడకలతో కోవిడ్-19 సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర, తమిళనాడు తరువాత దేశంలో అత్యధిక కరోనా కేసులు ఢిల్లీలో ఉన్నాయి. ఇక్కడ కరోనా కరోనా కేసుల సంఖ్య 87,000 దాటింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఈ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఈ కేంద్రంలో 600 పడకలు ఉంటాయని, వాటిలో 200 పడకలు ఇప్పటికే పూర్తిస్థాయిలో సిద్ధం చేశారన్నారు. ఈ సంరక్షణ కేంద్రంలో మొత్తం 80 మంది వైద్యులు, 150 మంది నర్సులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఇంటెన్సివ్ కేర్ అవసరమయ్యే బాధితులకు ఆసుపత్రులలో చికిత్స అందిస్తారని తెలిపారు.