కూలీలకు సరుకుల పంపిణీ
ABN , First Publish Date - 2020-04-05T11:28:01+05:30 IST
మండలంలోని అంతర్గాం గ్రామం లో మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన కూలీలకు బీజేపీ మండల నాయకులు నిత్యావసర
భీంపూర్: మండలంలోని అంతర్గాం గ్రామం లో మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన కూలీలకు బీజేపీ మండల నాయకులు నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల బీజేపీ అధ్య క్షుడు జజ్జరి రాకేష్ మాట్లాడుతూ కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుండావార్ ప్రకాష్, బొలిపెల్లి చిన్నయ్య, మేకల శంకర్, నిమ్మల నారా యణ, గంగయ్య తదితరులున్నారు. అదేవిధంగా అర్లి(టి) గ్రామంలోని గిరిజన 35 కుటుంబా లకు 10 రకాల నిత్యావసర వస్తువులు అర్లి(టి) యువకు లు స్వచ్ఛందంగా అందజేశారు. ఇందులో గుమ్ముల రామన్న, పిట్ల గజానన్, దండెకర్ ఆకాష్, రుద్రవిలాస్ తది తరులున్నారు.
నిరుపేద కుటుంబాలకు నగదు అందజేత
అంతర్గాం గ్రామంలో రూరల్ రిలేషన్ ఫౌండేషన్ తర ఫున రెండు నిరుపేద కుటుంబాలకు రూ.2 వేల నగదును సంస్థ ప్రతినిధి ప్రతిభ్లోకండే సర్పంచ్ బక్కి లలిత అకౌం ట్లో వేయడంతో సర్పంచ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో బక్కి కపిల్, విశాల్, విఠల్, అరీఫ్, పంచాయతీ కార్యదర్శి నర్సయ్య, వీఆర్ఓ రమేష్ తదితరులున్నారు.