క్రిప్టో కరెన్సీలు తప్పుడు చేతుల్లోకి వెళ్ళకుండా నిరోధించాలి : మోదీ

ABN , First Publish Date - 2021-11-18T19:47:12+05:30 IST

క్రిప్టో కరెన్సీలు అక్రమార్కులు, దుర్మార్గుల చెంతకు

క్రిప్టో కరెన్సీలు తప్పుడు చేతుల్లోకి వెళ్ళకుండా నిరోధించాలి : మోదీ

న్యూఢిల్లీ : క్రిప్టో కరెన్సీలు అక్రమార్కులు, దుర్మార్గుల చెంతకు చేరకుండా ప్రపంచంలోని ప్రజాస్వామిక దేశాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం 

పిలుపునిచ్చారు. డేటా గవర్నెన్స్ కోసం ప్రమాణాలు, నియమ, నిబంధనలను ప్రజాస్వామిక దేశాలు కలిసికట్టుగా రూపొందించాలని సిడ్నీ డయలాగ్‌లో మాట్లాడుతూ చెప్పారు.


జాతీయ హక్కులను కూడా గుర్తిస్తూ, వ్యాపారం, పెట్టుబడులు, విశాల ప్రజా శ్రేయస్సులను ప్రోత్సహించాలని చెప్పారు. క్రిప్టో కరెన్సీలపైన అన్ని ప్రజాస్వామిక దేశాలు కలిసికట్టుగా పని చేయవలసి ఉందని చెప్పారు. మన యువతను నాశనం చేసే తప్పుడు చేతుల్లోకి క్రిప్టో కరెన్సీలు వెళ్ళకుండా జాగ్రత్త వహించాలన్నారు. 


విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, క్రిప్టో కరెన్సీల గురించి భారీ వాగ్దానాలతో, పారదర్శకతలేకుండా, యువతను తప్పుదోవ పట్టించే ప్రకటనలను నిలిపేయడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు సమాచారం. 


Updated Date - 2021-11-18T19:47:12+05:30 IST