ఇంటిని కూల్చొద్దు

ABN , First Publish Date - 2021-03-05T05:39:54+05:30 IST

పట్టణంలోని 170 స ర్వే నెంబర్‌లో నిర్మించుకుంటున్న ఇళ్లను కూల్చి వేయడానికి వచ్చిన ఆర్డీవో జాడి రాజేశ్వర్‌ వాహనానికి బాధితులు అడ్డుపడ్డారు. తమ ఇళ్లను కూల్చొద్దని వేడుకున్నారు.

ఇంటిని కూల్చొద్దు
ఆర్డీవో వాహనం ఎదుట పడుకున్న బాధితులు

ఆదిలాబాద్‌టౌన్‌, మార్చి 4: పట్టణంలోని 170 స ర్వే నెంబర్‌లో నిర్మించుకుంటున్న ఇళ్లను కూల్చి వేయడానికి వచ్చిన ఆర్డీవో జాడి రాజేశ్వర్‌ వాహనానికి బాధితులు అడ్డుపడ్డారు. తమ ఇళ్లను కూల్చొద్దని వేడుకున్నారు. పట్టణంలోని భాగ్యనగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న గణపతి, ఆయన కొడుకు మరో ఇద్దరు 170 కాలనీలో ఇళ్లు నిర్మించుకుంటున్నారు. ఇది తెలిసిన ఆర్డీవో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో ఇల్లు కట్టుకుంటున్నారని హెచ్చరించారు. దీంతో బాధితులు తమకు 2013లో ఇదే సర్వే నెంబర్‌లో ఇండ్ల స్థలాలు ఇచ్చారని గతంలో ఇక్కడ కట్టుకున్న ఇండ్లను కూల్చి వేయగా తిరిగి ఎమ్మెల్యే జోగురామన్న చెప్పడంతో ఇల్లు కట్టుకుంటున్నామన్నారు. తమకు అన్యాయం చేస్తే పురుగుల మందు తాగి చస్తామని బాధితులు ఆయన వాహనం ఎదుట పడుకున్నారు. దీంతో వీఆర్‌ఏ పొచ్చన్న సముదాయించి వారిని పక్కకు జరపడంతో ఆర్డీవో తిరిగి వెళ్లి పోయారు.

Updated Date - 2021-03-05T05:39:54+05:30 IST