రాష్ట్రంలో రాక్షస పాలన

ABN , First Publish Date - 2022-01-24T05:24:47+05:30 IST

రాష్ట్రంలో రాక్షసపాలన సాగిస్తున్నారని మాజీ మంత్రిపల్లెరఘునాథరెడ్డి, మాజీ ఎంపీ నిమ్మలకిష్టప్ప విమర్శించారు.

రాష్ట్రంలో రాక్షస పాలన

గౌరవసభలో మాజీ మంత్రి పల్లె

కొత్తచెరువు, జనవరి 23: రాష్ట్రంలో రాక్షసపాలన సాగిస్తున్నారని మాజీ మంత్రిపల్లెరఘునాథరెడ్డి, మాజీ ఎంపీ నిమ్మలకిష్టప్ప విమర్శించారు. ఆది వారం మండల పరిఽధిలోని కేశాపురం గ్రామంలో మండల కన్వీనర్‌ రామక్రిష్ణా అధ్యక్షతన గౌరవసభ నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లె, నిమ్మల మా ట్లాడుతూ...మూడు సంవత్సరాల పాలన ముగుస్తుందని, ఇప్పటికే రాష్ట్రాన్ని అభివృద్ధిలో అతలాకుతలం చేశారన్నారు. పీఆర్సీలో తీవ్ర అన్యాయం చేసి ఉద్యోగుల జీవితాలతో చెలగాట మాడుతున్నాడని మండిపడ్డారు. ప్రభుత్వం చేసే అక్రమాలు, అన్యాయాలను ప్రశ్నించే టీడీపీ నాయ కులపై కేసులు బనా యిస్తున్నారని, ఇటువంటి తాటాకు చప్పుళ్లకు ఎవరూ బెదిరిపోమన్నారు.  ఇప్పటికే సీఎం సాగిస్తున్న పాలనతో ప్రజలు,  ఉద్యోగులు విసుగుచెందారని మండిపడ్డారు. సీఎంగా చంద్రబాబునాయుడును చేసుకుంటే రాష్ట్రం ఎంతో పురోగభివృద్ధి సాధిస్తుందని, దీనిని ప్రతి గుర్తుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్‌ అధికార ప్రతినిధి సాలక్కగారి శ్రీనివాసులు, టౌన్‌ కన్వీనర్‌ శ్రీనివాసులు, నాయకులు సామకోటి ఆది, బండ్లపలి ్లకిష్టప్ప, బోయ రాజు, కిలారి శ్రీనాథ్‌, యర్రపల్లికేశప్ప, వెంకటేశ్‌, ప్రభాకర్‌రావు, మహిళా నా యకురాలు మాధవి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-24T05:24:47+05:30 IST