మోదీజీ..ఇది మీ వైఫల్యమే: ఒవైసీ

ABN , First Publish Date - 2021-12-29T22:05:14+05:30 IST

యూపీలోని ఓ వ్యాపారవేత్త ఇంట్లో పెద్దమొత్తంలో నగదు పట్టుబడిన వ్యవహారంపై..

మోదీజీ..ఇది మీ వైఫల్యమే: ఒవైసీ

న్యూఢిల్లీ: యూపీలోని ఓ వ్యాపారవేత్త ఇంట్లో పెద్దమొత్తంలో నగదు పట్టుబడిన వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ బుధవారంనాడు ప్రశ్నించారు. 2016లో ప్రధాన నరేంద్ర మోదీ తీసుకువచ్చిన పెద్ద నోట్ల రద్దు (డీమోనిటైజేషన్) తర్వాత కూడా రూ.180 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రధాని మోదీ చెప్పాలన్నారు. ''మోదీ తన బ్రెయిన్ చైల్డ్ (డీమోనిటైజేషన్) వైఫల్యాన్ని ఒప్పుకుని తీరాలి. ఆయన తీసుకున్న నిర్ణయంతో చిన్నతరహా పరిశ్రమలు కుప్పకూలిపోయారు. ఉద్యోగాలు పోయాయి''అని ఒవైసీ పేర్కొన్నారు.


ప్రధాని మోదీ 2016 నవంబర్ 8న పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో అప్పటి వరకూ అమలులో ఉన్న రూ.500, రూ.1000 నోట్లు రద్దయ్యాయి. ఆ తర్వాత కొత్త రూ.500, రూ.2,000 నోట్లను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది.

Updated Date - 2021-12-29T22:05:14+05:30 IST