త్వరలో డెంగీ టీకా!
ABN , First Publish Date - 2020-09-25T06:55:06+05:30 IST
డెంగీ టీకాను వీలైనంత త్వరగా మార్కెట్లోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్లు పనాసియా బయోటెక్ సంస్థ గురువారం ప్రకటించింది...
- అనుమతులకు పనాసియా బయోటెక్ దరఖాస్తు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 24: డెంగీ టీకాను వీలైనంత త్వరగా మార్కెట్లోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్లు పనాసియా బయోటెక్ సంస్థ గురువారం ప్రకటించింది. ఇప్పటికే ఫేజ్-1, ఫేజ్-2 క్లినికల్ అధ్యయనం పూర్తయిందని, ఇందులో వ్యాక్సిన్ భద్రతను, రోగనిరోధక శక్తిని విశ్లేషించామని పేర్కొంది. ఇది సింగిల్ డోస్ వ్యాక్సిన్ అని, 4 డెంగీ వైరస్ సెరోటై్ప్సకు వ్యతిరేకంగా బలమైన ప్రతిరక్షకాలను విడుదల చేయడాన్ని గుర్తించామని తెలిపింది. ఈ అధ్యయన ఫలితాలు ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో చాలా ముఖ్యమని భావిస్తున్నట్లు పనాసియా బయోటెక్ సంస్థ పేర్కొంది. కాగా.. ఈ సంస్థ టీకా అనుమతుల కోసం ఇప్పటికే డీసీజీఐ(డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా)ను సంప్రదించింది. తాజా పరిణామాలతో ఈ సంస్థ షేర్ వాల్యూ 4.99ు పెరిగి రూ.196.80కి చేరింది.