కొవిడ్తో దంత వైద్యుడి మృతి
ABN , First Publish Date - 2021-04-22T06:27:33+05:30 IST
జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్న దంత వైద్యుడు ముప్పన సతీ్షకుమార్ (45) కరోనా సోకడంతో రాజమహేంద్రవరంలో ఓ ప్రైవేట్ ఆసు పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు వైద్యాధికారులు తెలిపారు.
జగ్గంపేట, ఏప్రిల్ 21: జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్న దంత వైద్యుడు ముప్పన సతీ్షకుమార్ (45) కరోనా సోకడంతో రాజమహేంద్రవరంలో ఓ ప్రైవేట్ ఆసు పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు వైద్యాధికారులు తెలిపారు. రెండున్నర సంవత్సరాలుగా దంత వైద్య విధులు నిర్వహిస్తున్న సతీ్షకుమార్కు అయిదు రోజుల కిందట పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఆయన స్వగ్రామమైన పెద్దాపురం నుంచి రాజమహేంద్రవరంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈనేపథ్యంలో బుధవారం సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచినట్టు సీహెచ్సీ వైద్యాధికారి సత్యనారాయణ తెలిపారు.
కొవిడ్తో జూనియర్ అసిస్టెంట్ రమణ మృతి
దేవదాయ శాఖ పరిధిలో ఉన్న కాకినాడ అన్నదాన
సమాజంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కేవీ రమణ కొవిడ్తో బుధవారం
కాకినాడలో మృతిచెందారు. ఆమె మృతి పట్ల డీసీ విజయరాజు, ఏసీడీసీ ప్రసాద్,
ఆర్జేసీ త్రినాథరావు, తహశీల్దార్ సీహెచ్ శిరీషాదేవి,
సూపరింటెండెంట్లు, ఈవోలు సంతాపం వ్యక్తం చేశారు.