ఎరువుల కోసం ఆందోళన వద్దు
ABN , First Publish Date - 2020-08-11T10:16:45+05:30 IST
ఎరువుల కోసం రైతులు ఆందోళన చెందొద్దని వ్యవసాయ శాఖ ఏడీ మాలకొండయ్య తెలిపారు.
బొబ్బిలి రూరల్, ఆగస్టు 10: ఎరువుల కోసం రైతులు ఆందోళన చెందొద్దని వ్యవసాయ శాఖ ఏడీ మాలకొండయ్య తెలిపారు. సోమవారం బొబ్బిలి డివిజన్ వ్యవసాయ కార్యాలయంలో ప్రైవేట్, సొసైటీ ఎరువుల వ్యాపారులతో ఆయన మాట్లాడారు. సొసైటీలకు 180 టన్నులు, ప్రైవేట్ వర్తకులకు 964 టన్నులు, రైతు భరోసా కేంద్రాలకు 208 టన్నుల చొప్పున యూరియా సరఫరా చేశామన్నారు. ఇప్పటివరకు 1410 టన్నుల యూరియా అమ్మకాలు జరిగాయని చెప్పారు. ఎరు వులను రైతులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వ్యాపారులు ఎటువంటి తప్పిదాలకు పాల్పడినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏవో ఎం.శ్యాంసుందరరావు, తదితరులు పాల్గొన్నారు.