దేశాభివృద్ధిలో తెలంగాణ కీలకపాత్ర : కేటీఆర్

ABN , First Publish Date - 2021-06-10T18:00:25+05:30 IST

ఐటీ, పరిశ్రమల శాఖ 2020-21 వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్ గురువారం విడుదల చేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ..దేశాభివృద్ధిలో...

దేశాభివృద్ధిలో తెలంగాణ కీలకపాత్ర : కేటీఆర్

హైదరాబాద్‌: ఐటీ, పరిశ్రమల శాఖ 2020-21 వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్ గురువారం విడుదల చేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ..దేశాభివృద్ధిలో తెలంగాణ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ దూసుకెళ్తోందని వ్యాఖ్యానించారు. పారదర్శకత కోసం ప్రతి ఏడాది వార్షిక నివేదికలు విడుదల చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఐటీ సెక్టార్ చాలా అభివృద్ధి చెందిందని, సీఎం కేసీఆర్ విధివిధానాలు, సమిష్టి కృషితోనే ఇది సాధ్యంమైందని కేటీఆర్‌ తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఐటీ, పారిశ్రామిక రంగాల్లో అద్భుత ప్రగతిని సాధించామన్నారు. సీఎం కేసీఆర్ దార్శనికత వల్ల దేశంలో అగ్రగామిగా ఎదుగుతున్నామన్నారు. కష్టపడి పనిచేసే వాళ్లు ఉన్నారు కాబట్టి అభివృద్ధి సాధ్యమైందని అన్నారు.

Updated Date - 2021-06-10T18:00:25+05:30 IST