హైదరాబాద్‌కు కేంద్ర బలగాలను రప్పించండి

ABN , First Publish Date - 2020-11-28T08:39:45+05:30 IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల దృష్ట్యా శాంతి భద్రతల పరిక్షణకు ప్రత్యేక బలగాలను, ఎన్నికల

హైదరాబాద్‌కు కేంద్ర బలగాలను రప్పించండి

 గవర్నర్‌ను కోరిన బీజేపీ నేతలు

హైదరాబాద్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల దృష్ట్యా శాంతి భద్రతల పరిక్షణకు ప్రత్యేక బలగాలను, ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేక పరిశీలకులను పంపించేలా కేంద్రాన్ని కోరాలని గవర్నర్‌కు బీజేపీ విజ్ఞప్తి చేసింది. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిలు శుక్రవారం గవర్నర్‌ తమిళిసైని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. గవర్నర్‌తో భేటీ అనంతరం డాక్టర్‌ లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌లో అల్లర్లు జరిగి ఎన్నికలు వాయిదా పడాలని కేసీఆర్‌ కోరుకుంటున్నారని ఆరోపించారు. 


Updated Date - 2020-11-28T08:39:45+05:30 IST