ఒత్తిడిని జయించడంపై రామకృష్ణ మఠం ఆన్ లైన్ కోర్స్

ABN , First Publish Date - 2020-11-20T22:47:50+05:30 IST

నేటి కాలంలో యువతీ, యువకులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితం మధ్య నలిగిపోతున్న చాలా మందికి డిప్రెషన్ బారిన పడుతున్నారు.

ఒత్తిడిని జయించడంపై రామకృష్ణ మఠం ఆన్ లైన్ కోర్స్

నేటి కాలంలో యువతీ, యువకులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితం మధ్య నలిగిపోతున్న చాలా మందికి డిప్రెషన్ బారిన పడుతున్నారు. దీన్నుంచి బయటపడలేక ఒక్కోసారి తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ అంశంపైనే హైదరాబాద్ రామకృష్ణ మఠంలోని ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్’ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది.  ఒత్తిడి నుంచి బయటపడటంపై కొత్త కోర్సును ప్రవేశపెట్టిన ఆర్కే మఠ్.. ఈ నెల 23 నుంచి 27 వరకు క్లాసులు ఏర్పాటు చేసింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉండే ఈ తరగతలు.. ఉదయం 6.15 నుంచి 7.15 వరకు జరుగుతాయి. స్వామి వివేకానంద బోధనల ఆధారంగా డాక్టర్ ఉష తదితర నిపుణులు ఈ క్లాసులు చెబుతారు. 16 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వారు మాత్రమే అర్హులు.  


ఆర్‌కే మఠ్‌లో యోగా, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందింప చేసే కోర్సులు కూడా నిర్వహిస్తున్నారు. మహిళలకు, న్యాయవాదులకు కూడా ప్రత్యేక కోర్సులున్నాయి. బాలల కోసం బాల వికాస్ నిర్వహిస్తున్నారు.


మరిన్ని వివరాలకు 040-27627961, 9177232696 నెంబర్లలో సంప్రదించవచ్చని రామకృష్ణ మఠం ప్రతినిధులు తెలిపారు.


రామకృష్ణ మఠం పని వేళలు : ఉదయం 8.30 గంటల నుంచి 11.30 గంటల వరకు; సాయంత్రం 4.30 గంటల నుంచి 7.30 గంటల వరకు.

Updated Date - 2020-11-20T22:47:50+05:30 IST