ఉపముఖ్యమంత్రి కావాలనే ఆశతో.. చీటీలు రాసి...
ABN , First Publish Date - 2020-09-19T16:34:34+05:30 IST
మంత్రి పదవుల కోసం సీనియర్లు, కీలకనేతలు హస్తినా నగరికి చేరుకుని అధిష్ఠానం పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు పడిగాపులు పడుతున్నారు. ఇందుకు ముఖ్యకారణం
బెంగళూరు (ఆంధ్రజ్యోతి): మంత్రి పదవుల కోసం సీనియర్లు, కీలకనేతలు హస్తినా నగరికి చేరుకుని అధిష్ఠానం పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు పడిగాపులు పడుతున్నారు. ఇందుకు ముఖ్యకారణం ముఖ్యమంత్రి యడియూరప్ప మూడురోజుల ఢిల్లీ పర్యటనలో ఉండటంతో ఆశావహులంతా అక్కడే మకాం వేశారు. పదవులు కోసం ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రాష్ట్రంలోనే గడుపుతున్న వైద్య ఆరోగ్యశాఖా మంత్రి శ్రీరాములు మాత్రం దుర్గాదేవిని దర్శించుకుని ఉపముఖ్యమంత్రి హోదా కల్పించాలని ప్రత్యేక పూజలు జరిపించడం చర్చనీయాంశమయ్యింది. యాదగిరి జిల్లా శహపురలో వెలసిన దుర్గాదేవి దర్శనానికి గురువారం వెళ్ళిన శ్రీరాములు ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. దుర్గాదేవి చెంతకు ఓ చీటీ రాసి పూజలు జరిపించారు. అందులో శ్రీరాములు, డిప్యూటీ ఛీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటకగా నమోదు చేశారు. ఇక్కడ దేవిని ఆరాధిస్తే అనుకున్నది జరుగుతుందనే భక్తుల నమ్మకం. సాధారణంగానే శ్రీరాములుకు దైవభక్తి ఎక్కువనేది తెలిసిన విషయమే. శ్రీరాములు రాసిన చీటీ సోషల్ మీడియాలో శుక్రవారం తీవ్రగా హల్ఛల్ చేస్తోంది. అభిమానులు మాత్రం శ్రీరామలు కోరిక ఖచ్చితంగా తీరుతుందని గట్టిగా చెబుతున్నారు. గతంలో డీకే శివకమార్ కూడా ఆలయాన్ని సందర్శించారు. అమ్మవా రిని పలువురు ప్రముఖులు దర్శించడం ఆనవాయితీ.