జలయజ్ఞాన్ని నిర్వీర్యం చేసిన పాపం టీడీపీదే: Dharmana
ABN , First Publish Date - 2021-11-05T18:32:27+05:30 IST
జలయజ్ఞాన్ని నిర్వీర్యం చేసిన పాపం టీడీపీదే అని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ విమర్శించారు.
శ్రీకాకుళం: జలయజ్ఞాన్ని నిర్వీర్యం చేసిన పాపం టీడీపీదే అని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ విమర్శించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడుతూ ఇతర పార్టీలతో పొత్తుల వ్యవహారం సిగ్గుచేటన్నారు. ప్రజలకు జవాబు దారీగా అభివృద్ధి, సంక్షేమ దిశగా ముఖ్యమంత్రి పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. వంశధార నదిపై నేరేడు బ్యారేజ్ నిర్మించే విషయంలో సీఎం జగన్ ఒడిషా వెళ్తారని తెలిపారు. ఒడిశా సీఎంతో చర్చించి బ్యారేజ్ నిర్మాణానికి ఉన్న ఆటంకాలు త్వరలో తొలగిపోతాయని ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు.