కరోనాతో కన్నుమూసిన డిప్యూటీ మేజిస్ట్రేట్

ABN , First Publish Date - 2020-07-13T23:52:07+05:30 IST

పశ్చిమ బెంగాల్‌లో ఓ డిప్యూటీ మేజిస్ట్రేట్ కరోనా బారినపడి సోమవారం కన్నుమూశారు. ప్రభుత్వ సీనియర్ అధికారి

కరోనాతో కన్నుమూసిన డిప్యూటీ మేజిస్ట్రేట్

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఓ డిప్యూటీ మేజిస్ట్రేట్ కరోనా బారినపడి సోమవారం కన్నుమూశారు. ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు కరోనా మరణించడం రాష్ట్రంలో ఇదే తొలిసారని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. హూగ్లీ జిల్లాకు చెందిన దేబ్‌దత్తా సెరాంపోర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. గతవారం ఆమెకు కరోనా సోకగా హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడంతో ఆదివారం ఉదయం ఆసుపత్రిలో చేరగా, పరిస్థితి విషమించడంతో నిన్న మరణించారు. 

Updated Date - 2020-07-13T23:52:07+05:30 IST