ఉప తహశీల్దార్లకు పదోన్నతులు
ABN , First Publish Date - 2021-10-24T06:54:54+05:30 IST
జిల్లాలో పలువురు ఉప తహశీల్దార్లకు తహశీల్దా ర్లుగా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
పిఠాపురం, అక్టోబరు 23: జిల్లాలో పలువురు ఉప తహశీల్దార్లకు తహశీల్దా ర్లుగా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జోన్-2 పరిధిలోని వీరికి పదోన్నతుల అనంతరం జిల్లాలు కేటాయిస్తూ భూపరిపాలన చీఫ్ కమిషనర్ నీరబ్కుమార్ప్రసాద్ ఆదేశాలు జారీచేశారు. వీరిని విధుల్లో చేర్చుకుని పోస్టింగ్లు ఇవ్వాలని సూచించారు. జిల్లాలోని ఉపతహశీల్దార్లు లోడా లక్ష్మీకుమారి, వీఎస్వీవీకేవీఆర్ మురార్జి (కాకినాడ రూరల్), పితాని త్రినాథరావులకు తహశీల్దార్లుగా పదోన్నతి కల్పించి మన జిల్లాకే కేటాయించగా, తాడిగడప కృష్ణారావు, నండూరి వెంకటేశ్వరరావు (గొల్లప్రోలు)లకు పశ్చిమగోదావరి, టీ విద్యానందశర్మకు కృష్ణా జిల్లా కేటాయించారు. కృష్ణా జిల్లాకు చెందిన వై రంగారావు, వీ నాగభూషణంలకు పదోన్నతి కల్పించి అదే జిల్లాకు కేటాయించారు. వీరంతా పదిహేను రోజుల్లోగా విధుల్లో చేరాలని కమిషనర్ సూచించారు.