కట్నం వేధింపుల కారణంగా.. పురుగుల మందు తాగి..
ABN , First Publish Date - 2020-08-10T18:29:28+05:30 IST
ఒక వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. యర్నగూడెంకు..
దేవరపల్లి(పశ్చిమ గోదావరి): ఒక వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. యర్నగూడెంకు చెందిన నిమ్మల నాగచంద్రిక (21)కు ఏడు నెలల క్రితం సూర్యనారాయణపురానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. ఈక్రమంలో ఆమె ఆదివారం తన పుట్టింటి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కట్నం వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ స్వామి తెలిపారు. ఘటనా స్థలాన్ని కొవ్వూరు డీఎస్పీ రాజేశ్వరరెడ్డి పరిశీలించారు.