నైపుణ్యాన్ని పెంపొందించుకోండి
ABN , First Publish Date - 2021-07-29T05:22:11+05:30 IST
సచివాలయంలో పని చేస్తున్న ఇంజినీరింగ్ అసిస్టెంట్లు నైపుణ్యాన్ని పెంపొం దించుకోవాలని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం పాతపట్నం పంచాయతీరాజ్ సబ్డివిజనల్ పరిధిలోని సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు ఒక్కరోజు శిక్షణ నిర్వహించారు.
జేసీ శ్రీనివాసులు
హిరమండలం, జూలై 28: సచివాలయంలో పని చేస్తున్న ఇంజినీరింగ్ అసిస్టెంట్లు నైపుణ్యాన్ని పెంపొం దించుకోవాలని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం పాతపట్నం పంచాయతీరాజ్ సబ్డివిజనల్ పరిధిలోని సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు ఒక్కరోజు శిక్షణ నిర్వహించారు. సమస్యలు పరిష్కరించే బాధ్యత ఇంజినీరింగ్ అసిస్టెంట్లదేనన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రభావతి, ఇతరశాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.