అభివృద్ధి పనులకు నిధుల మంజూరు
ABN , First Publish Date - 2021-04-18T05:14:40+05:30 IST
మండల అభివృద్ధికి 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.61లక్షలు మంజూరైనట్లు ఎంపీడీవో మాచర్ల రమాదేవి అన్నారు.
15వ ఆర్థిక సంఘం నిధులు రూ.61లక్షలు మంజూరు
ఎంపీడీవో రమాదేవి
కారేపల్లి ఏప్రిల్ 17: మండల అభివృద్ధికి 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.61లక్షలు మంజూరైనట్లు ఎంపీడీవో మాచర్ల రమాదేవి అన్నారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ గత ఏడాది జూలై నుంచి ఈఏడాది మార్చి వరకు 9 నెలలకు గాను నిధులు మంజూరైనట్లు తెలిపారు. బేసిక్ గ్రాంట్ద్వార రూ. రూ.20లక్షల34వేలు, టైడ్గ్రాంట్ ద్వార రూ.20లక్షల34వేలు, ఎస్ఎ్ఫసీ స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ ద్వార రూ.20లక్షల38వేల నిధులు వచ్చినట్లు తెలిపారు.ఈనిధులను ఎంపీటీసీ సభ్యుల ద్వార పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అయితే మండలం 16మంది ఎంపీటీసీ సభ్యులు ఉండాగా ప్రభుత్వం కేవలం 61లక్షలు మాత్రమే మంజూరుచేయడం పట్ల ఎంపీటీసీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే వచ్చిన నిధులతో మురికినీటి కాలువలు, చెత్తబుట్టల ఏర్పాటు, పాఠశాలలకు, అంగన్వాడి కేంద్రాలకు నీటి సరఫరా ఏర్పాటుకు ఉపయోగించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మాలోత్ శకుంతల, జడ్పీటీసీ జగన్, ఆర్డబ్ల్యూ ఏఈ నరేందర్, ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షుడు పాండ్యానాయక్ పలువురు ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.