‘టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం’

ABN , First Publish Date - 2022-01-24T04:55:46+05:30 IST

ఆదిలాబాద్‌లోని తన నివాసంలో తలమడుగు మండలంలోని దేవాపూర్‌ గ్రామానికి చెందిన పర్వేనా బేగం, సయేద్‌ అహ్మది, గౌసియా బేగం ముగ్గురు లబ్ధిదారులకు, లచ్చింపూర్‌కు చెందిన షేక్‌ సలీమాకు షాదీముబారక్‌ చెక్కులను ఎమ్మెల్యే రాథోడ్‌బాపురావు పంపిణీ చేశారు.

‘టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం’


తలమడుగు, జనవరి23: ఆదిలాబాద్‌లోని తన నివాసంలో తలమడుగు మండలంలోని దేవాపూర్‌ గ్రామానికి చెందిన పర్వేనా బేగం, సయేద్‌ అహ్మది, గౌసియా బేగం ముగ్గురు లబ్ధిదారులకు, లచ్చింపూర్‌కు చెందిన షేక్‌ సలీమాకు షాదీముబారక్‌ చెక్కులను ఎమ్మెల్యే రాథోడ్‌బాపురావు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మైనార్టీల అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని, మైనార్టీల కోసం ఎన్నో వినూత్న పథకాలను ప్రవేశ పెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ తోట వెంకటేశ్‌, టీఆర్‌ఎస్‌ ఎస్సీ సెల్‌ జిల్లా నాయకులు కిరణ్‌, మాజీ కన్వీనర్‌ ఎల్మ శ్రీనివాస్‌రెడ్డి, అబ్దుల్లా, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-24T04:55:46+05:30 IST