అభివృద్ధే టీఆర్ఎస్ ధ్యేయం
ABN , First Publish Date - 2021-07-25T04:23:07+05:30 IST
అభివృద్ధే టీఆర్ఎస్ ధ్యేయమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
- వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి
- మండలంలో అభివృద్ధి పనులు ప్రారంభం
మానవపాడు, జూలై24: అభివృద్ధే టీఆర్ఎస్ ధ్యేయమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. శనివారం మానవపాడులో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. మొదటగా మానవ పా డులో నిర్మించిన ఆర్డబ్ల్యూఎస్ వాటర్ ట్యాంక్ను, గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఎద్దుల బండిపై రైతువేదిక భవనం వద్దకు ర్యాలీ గా వచ్చి దానిని ప్రారంభించారు. అనంతరం కేటీఆర్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యే అబ్రహాం, ఎంపీపీ అశోక్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పటేల్ విష్ణువర్ధన్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ శ్రీధర్ రెడ్డి, సర్పంచ్ హైమావతి, సాయినాథ్ రెడ్డి, హరినాథ్ రెడ్డి పాల్గొన్నారు.