వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యం

ABN , First Publish Date - 2022-02-04T06:14:54+05:30 IST

వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యమని టీడీపీ ఎలమంచిలి నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు అన్నారు.

వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యం
కుమ్మరాపల్లిలో మాట్లాడుతున్న ప్రగడ నాగేశ్వరరావు

 టీడీపీ ఎలమంచిలి నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ

రాంబిల్లి, ఫిబ్రవరి 3: వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యమని టీడీపీ ఎలమంచిలి నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు అన్నారు. గురువారం మండలంలోని రజాల, కుమ్మరాపల్లి గ్రామాల్లో ఏర్పాటైన గౌరవ సభల్లో మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చింది మొదలు ప్రజలకు అన్నీ భారాలే అన్నారు. ప్రజారంజక పాలన టీడీపీతోనే సాధ్యమన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రంగనాయకులు, మండల  అధ్యక్షుడు వి.దిన్‌బాబు, తోట మోహన్‌, నరసింగరావు, మల్లప్పదొర పాల్గొన్నారు.

‘ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బందులు సరికాదు’

అచ్యుతాపురం: ప్రభుత్వ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని టీడీపీ ఎలమంచిలి నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు అన్నారు. గురువారం సాయంత్రం ఆయన ఇక్కడి విలేఖర్లతో మాట్లాడుతూ ఉద్యోగుల నుంచి ట్యాక్స్‌ రూపంలో వసూలు చేసిన కోట్లాది రూపాయలను పథకాలు రూపంలో పంచి పెడుతున్నారన్నారు.  అటువంటి ఉద్యోగులకు మేలు చేయాల్సింది పోయి, కీడు తలపెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 

Updated Date - 2022-02-04T06:14:54+05:30 IST