టీడీపీతోనే ముస్లిం మైనారిటీల అభివృద్ధి : ఉగ్ర
ABN , First Publish Date - 2021-09-18T07:15:53+05:30 IST
ముస్లీం మైనార్టీల అభివృద్ది టీడీపీ పాలనతోనే సాధ్యమని టీడీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పేర్కొన్నారు.
కనిగిరి, సెప్టెంబరు 17: ముస్లీం మైనార్టీల అభివృద్ది టీడీపీ పాలనతోనే సాధ్యమని టీడీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పేర్కొన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం నగర పంచాయతీ ముస్లిం మైనార్టీ నూతన కమిటీ ఎంపిక ఏకగ్రీవంగా ఎంపికైంది. ఈ సందర్భంగా డాక్టర్ ఉగ్ర కమిటీకి ఎంపికైన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లీం మైనార్టీలకు అన్ని విధాలుగా అండగా ఉంటానన్నారు. తాను అధికారంలో ఉన్నా, లేకున్నా ముస్లింలు తనకు అండగా ఉంటూనే వచ్చారన్నారు. పదవులు చేయాలని అనేక మందికి ఉంటుందనీ, వారి కుటుంబ, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆ పదవులకు తగిన న్యాయం చేయలేరని పేర్కొన్నారు. అందుకే కేవలం పూర్తిస్థాయిలో పార్టీ కార్యక్రమాలకు, మనుగడకు కృషి చేసేవారికే అవకాశం కల్పించామే తప్పా పదవి ఉన్నా లేకున్నా తనకు అందరు సమానమే అన్నారు. ఎన్నికలు ఒక ఏడాది ముందే వచ్చే పరిస్థితులు కనపడుతున్నాయన్నా రు. అనంతరం నూతనంగా ముస్లీం మైనార్టీ కమిటీకి ఎంపికైన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, సభ్యులను పార్టీ కండువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు.
నూతన కమిటీ ఎన్నిక
నగర పంచాయతీ ముస్లీం మైనార్టీ నూతన కమిటీ ఎంపికలో అధ్యక్షుడిగా షేక్ అహ్మద్, ప్రధాన కార్యదర్శిగా కరాటే యాసిన్, ఉపాధ్యక్షులుగా బుజ్జి, కోశాధికారిగా షేక్ యాసిన్తో పాటు కార్యవర్గ సభ్యులు, కార్యదర్శులు, కార్యనిర్వాహక కార్యదర్శులుగా ఎన్నుకో బడ్డారు. నగర పంచాయతీ టీడీపీ అధ్యక్షులు తమ్మినేని శ్రీనివాసులరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో షేక్ ఫిరోజ్, వివిఆర్ మనోహరరావు, మాజీ అంజుమన్ కమిటీ చైర్మన్ రోషన్ సందాని, గుడిపాటి ఖాదర్, తమ్మినేని వెంకటరెడ్డి, షేక్ జంషీర్ అహ్మద్, గౌస్బాష (బుడ్డెం), ఫారూక్, జిలాని, బుల్లా బాలబాబు తదితరులు పాల్గొన్నారు.