సీఎం కేసీఆర్‌ కృషితోనే ఆలయాల అభివృద్ధి

ABN , First Publish Date - 2021-06-15T07:03:44+05:30 IST

రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ కృషితోనే ఆలయాల అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులను సోమవారం ఆయన పరిశీలించారు.

సీఎం కేసీఆర్‌ కృషితోనే ఆలయాల అభివృద్ధి
బాలాలయం ఎదుట ప్రహరీ నుంచే స్వామివారికి మొక్కుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

 రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి  ఎర్రబెల్లి దయాకర్‌రావు

యాదాద్రి టౌన్‌, జూన్‌ 14: రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ కృషితోనే ఆలయాల అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి  ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.  యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి  ఆలయ అభివృద్ధి పనులను సోమవారం ఆయన పరిశీలించారు. ఆయనకు అర్చకులు, అధికారులు ఆలయ మర్యా దలతో స్వాగతం పలికారు. లాక్‌డౌన్‌ ఆంక్షల నేపథ్యంలో బాలాలయం ఎదుట ప్రహరీ నుంచే స్వామివారిని మొక్కుకున్నారు అనంతరం ఆయన మాట్లాడతూ  యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం రాష్ట్ర ప్రజలకు గర్వ కారణమన్నారు. కొనియాడారు. చీఫ్‌ జస్టిస్‌ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై దేవస్థాన ఈవో గీతారెడ్డితో సమీక్షించారు. కార్యక్రమంలో  దేవస్థాన అధికారులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు. 



Updated Date - 2021-06-15T07:03:44+05:30 IST