గ్రామాల అభివృద్ధి సీఎంతోనే సాధ్యం

ABN , First Publish Date - 2022-07-29T06:21:31+05:30 IST

సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతో గ్రామాల అభివృద్ధి సీఎం జగన్మోహన్‌రెడ్డితోనే సాధ్యమని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌ అన్నారు.

గ్రామాల అభివృద్ధి సీఎంతోనే సాధ్యం
చిన్నయ్యపాలెంలో ప్రజలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గణేశ్‌


 నర్సీపట్నం ఎమ్మెల్యే గణేశ్‌  

గొలుగొండ, జూలై 28: సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతో గ్రామాల అభివృద్ధి సీఎం జగన్మోహన్‌రెడ్డితోనే సాధ్యమని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌ అన్నారు.  గురువారం ఆయన చిన్నయ్యపాలెం, అనంతసాగరంల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని, ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాగునీటి బోరు ఏర్పాటు చేయాలని చిన్నయ్యపాలెం మహిళలు కోరారు. అనంతసాగరంలో ఇళ్లు మంజూరు చేయాలని, సిమెంట్‌ రోడ్లు ఏర్పాటు చేయాలని కోరారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయా గ్రామాల ప్రజలకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పీఆర్‌డీఈఈ ప్రసాద్‌, నర్సీపట్నం మార్కెట్‌ చైర్మన్‌ చిటికెల భాస్కరనాయుడు, ఎంపీపీ గజ్జలపు మణికుమారి, జడ్పీటీసీ సభ్యుడు సుర్ల వెంకట గిరిబాబు, వైసీపీ మండల అధ్యక్షుడు లెక్కల సత్యనారాయణ, వైస్‌ఎంపీపీలు సుర్ల ఆదినారాయణ, నాగమణి, సర్పంచులు లోచుల సుజాత, పత్తి రమణ పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-29T06:21:31+05:30 IST