సమష్టి కృషితో గ్రామాల అభివృద్ధి

ABN , First Publish Date - 2021-03-02T05:04:25+05:30 IST

సమష్టి కృషితోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని ఎంపీపీ డుబ్బుల నానయ్య అన్నారు.

సమష్టి కృషితో గ్రామాల అభివృద్ధి
మాట్లాడుతున్న ఎంపీపీ డుబ్బుల నానయ్య

-ఎంపీపీ డుబ్బుల నానయ్య

చింతలమానేపల్లి, మార్చి1: సమష్టి కృషితోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని ఎంపీపీ డుబ్బుల నానయ్య అన్నారు. చింతలమానేపల్లి ప్రజా పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ  ఆధ్వర్యంలో సోమవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీపీ మాట్లాడుతూ  గ్రామాల్లో ఎక్కడ సమస్యలు ఉన్నా ప్రజాప్రతినిధులు  ఆయా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఆయా శాఖల అధికారులు తమ నివేధికలను చదివి సభ్యులకు విన్పించారు.  ప్రతీ ఇంటికి నళ్లాలు నిర్మించి నీళ్లు పంపిణీ చేయాలని జడ్పీటీసీ డుబ్బుల శ్రీదేవి అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో తహసీల్దార్‌ బికర్నిదాస్‌, కో ఆప్షన్‌ సభ్యుడు నాజీమ్‌ హుస్సేన్‌, ఎంపీడీఓ కుటుంబరావు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-02T05:04:25+05:30 IST