అభివృద్ధిలో ఆదర్శం సత్తుపల్లి
ABN , First Publish Date - 2020-08-03T10:27:48+05:30 IST
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో సత్తుపల్లి నియోజకవర్గం ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే సండ్ర
సీఎం కేసీఆర్ ప్రశంసలు
ఎమ్మెల్యే వెంకటవీరయ్య
తల్లాడ, ఆగస్టు 2: రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో సత్తుపల్లి నియోజకవర్గం ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం తల్లాడ మండలం తెలగవరం గ్రామంలో వైకుంఠధామాన్ని, రెడ్డిగూడెంలో పల్లెప్రకృతివనాన్ని ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని సత్తుపల్లి నియోజకవర్గంలో కొత్తకారాయిగూడెం వైకుంఠధామం గురించి సీఎం కేసీఆర్ అభినందించారని పేర్కొన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో 90శాతం వైకుంఠధామాలు పూర్తిచేశామన్నారు. ఉపాధి హామీ ద్వారా సత్తుపల్లి నియోజకవర్గంలో పంటకాల్వల పూడికతీత పనుల్లో కూడా నియోజకవర్గం ముందంజలో ఉందన్నారు.
మొక్కలు నాటడం కంటే నాటిన మొక్కలను సంరక్షించటం ప్రధాన లక్ష్యం కావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు, ఎంపీడీవో బి.రవీందర్రెడ్డి, సొసైటీ చైర్మన్ రెడ్డెం వీరమోహన్రెడ్డి, ఏఎంసీ వైస్చైర్మన్ దూపాటి భద్రరాజు, టీఆర్ఎస్ మండల కార్యదర్శి దుగ్గిదేవర వెంకట్లాల్, సర్పంచ్లు తేళ్లూరి కృష్ణయ్య, బద్దం నిర్మల, శీలం కోటారెడ్డి, నారపోగు వెంకటేశ్వర్లు, జొన్నలగడ్డ కిరణ్కుమార్, మువ్వా మురళీధర్రావు, బద్దం కోటిరెడ్డి, జీవీఆర్ పాల్గొన్నారు