టీడీపీ హయాంలోనే అభివృద్ధి : బీకే

ABN , First Publish Date - 2022-07-28T04:25:42+05:30 IST

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మాత్రమే గ్రామీణ స్థాయిలో అభివృద్ధి జరిగిందని హిందూపురం పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథి పేర్కొన్నారు.

టీడీపీ హయాంలోనే అభివృద్ధి : బీకే
సభ్యత్వ నమోదులో మాట్లాడుతున్న బీకే పార్థసారథి

రొద్దం, జూలై 27: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మాత్రమే గ్రామీణ స్థాయిలో అభివృద్ధి జరిగిందని హిందూపురం పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథి పేర్కొన్నారు. బుధవారం రొద్దం మండల పరిధిలోని దొడగట్ట గ్రామంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బీకే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ ఫలాలను పేదలకు అందాయన్నారు. రొద్దంలో జూనియర్‌ కళాశాల, 9 జిల్లారిషత ఉన్నత పాఠశాలలు, వైటిరెడ్డిపల్లి వరకు తారు రోడ్డు, గ్రామ గ్రామాన సీసీరోడ్లు, ఎంజేపీ పాఠశాల అభివృద్ధికి నిధులు వెచ్చించామన్నారు. ప్రఖ్యాతిగాంచిన కియ పరిశ్రమను తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదే అన్నారు. గొల్లపల్లి రిజర్వాయర్‌ను నిర్మించి ప్రతి మండలానికి సాగునీరు తీసుకొచ్చామన్నారు. ప్రస్తుత జగన ప్రభుత్వ హయాంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా జరిగిందా? అని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదుకు రూ.100 చెల్లించి భవిష్యత్తులో రూ.2లక్షల ప్రమాద బీమా పొందవచ్చన్నారు. ఎన్టీఆర్‌ పాఠశాలలో చేరాలన్నా సభ్యత్వ నమోదు తప్పనిసరి అన్నారు. ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్‌ అధికార ప్రతినిధి రొద్దం నరసింహులు, తెలుగు మహిళ పార్లమెంట్‌ అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, మాజీ జెడ్పీటీసీ చిన్నప్పయ్య, కన్వీనర్‌ నరహరి, దొడగట్ట నాయకులు రామచంద్ర, టైటెక్‌ రామచంద్ర, ఈడిగ చంద్ర, శేషం నాయుడు, ధర్మపాల్‌, మాజీ మార్కెట్‌యార్డ్‌ చైర్మన వెంకటరామిరెడ్డి, మాజీ సర్పంచ జయప్ప, ఇమాం తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-28T04:25:42+05:30 IST