ప్రజల సహకారంతోనే అభివృద్ధి
ABN , First Publish Date - 2021-06-24T04:29:01+05:30 IST
ప్రజల సహకారంతోనే అభివృద్ధి
- ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
ఆమనగల్లు: అభివృద్ధిలో ప్రజలంతా ఐక్యంగా ముందుకు రావాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. కడ్తాల మండల కేంద్రానికి చెందిన సీనియర్ నాయకుడు సూద శివయ్యకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.60 వేల చెక్కును బుధవారం నగరంలోని తన నివాసంలో ఎమ్మెల్సీ అందజేశారు. అదేవిధంగా జంగారెడ్డిపల్లికి చెంది న వెంకటయ్యకు రూ.2లక్షలు, చెదురుపల్లికి చెంది న రఘువర్మకు రూ.24 వేలు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరు కాగా ఎమ్మెల్యే హైదరాబాద్లోని తన నివాసంలో చెక్కులందజేశారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు భన్సీలాల్, రమేశ్, సురేందర్రెడ్డి, మాసయ్య, శ్రీనివా్సరెడ్డి, రేణురెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, రఘుపతిరెడ్డి, డేవిడ్, బాబా పాల్గొన్నారు.
సీఎం సహాయనిధి పేదలకు వరం : ఎంపీపీ
కేశంపేట: ఎక్లా్సఖాన్పేట గ్రామానికి చెందిన శ్రీశైలంకు రూ.22,500, సంగెం గ్రామానికి చెందిన సుగుణమ్మకు రూ.16,000 సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన చెక్కులను ఎంపీపీ రవీందర్యాదవ్ బుధవారం ఆయన స్వగృహంలో అందించారు. కార్యక్రమంలో మురళీధర్రెడ్డి, నాయకులు జమాల్ఖాన్ తదితరులు పాల్గొన్నారు.