టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే అభివృద్ధి : ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2022-02-06T05:23:43+05:30 IST

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే అభివృద్ధి : ఎమ్మెల్యే

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే అభివృద్ధి : ఎమ్మెల్యే
నిర్దవెల్లిలో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే అంజయ్య

కేశంపేట/షాద్‌నగర్‌ రూరల్‌, ఫిబ్రవరి 5: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పరుగుపెడుతున్నాయని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ అన్నారు. శనివారం కేశంపేట మండలం తొమ్మిదిరేకులలో ఆర్చ్‌, లింగంధన, నిర్దవెల్లి, బొదునంపల్లిలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... అభివృద్ధి విషయంలో రా జీపడం అన్నారు. ఎంపీపీ రవీందర్‌, జెడ్పీటీసీ విశాలశ్రావణ్‌రెడ్డి, సర్పంచ్‌లు సావిత్రిబాల్‌రాజ్‌గౌడ్‌, పార్వతమ్మ, ప్రతాప్‌, వెంకట్‌రెడ్డి, నవీన్‌కుమార్‌, కళమ్మ, నాయకులు మురళీధర్‌రెడ్డి, లక్ష్మీనారాయణగౌడ్‌, జగదీశ్వర్‌గౌడ్‌, శేఖర్‌రెడ్డి, అంజిరెడ్డి, మల్లే్‌షయాదవ్‌, రమే్‌షయాదవ్‌, కృష్ణయ్య, సరేందర్‌, జమాల్‌ఖాన్‌, భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం నాలుగురోజుల కింద షాద్‌నగర్‌ సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన లేమామిడికి చెందిన వినయ్‌గౌడ్‌(23) కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. వినయ్‌ తండ్రి రవిగౌడ్‌, కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. 


  • అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు

షాద్‌నగర్‌, ఎలికట్ట తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌, ఎంపీ మన్నె శ్రీనివా్‌సరెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి సుడిగాలి పర్యటన చేసి అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఎలికట్టలో ఎస్సీ కమ్యూనిటీ హా లు నిర్మాణానికి భూమిపూజ, పట్టణంలోని విద్యుత్‌ కా లనీ, కేశంపేట రోడ్డులో సీసీ రోడ్డు పనులను ప్రారంభి ంచారు. నీటి సరఫరాను ప్రారంభించారు. కార్యక్రమా ల్లో మున్సిపల్‌ చైర్మన్‌ నరేందర్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-02-06T05:23:43+05:30 IST