అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2020-07-08T09:55:37+05:30 IST
అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ బీఎస్ లత అధికారులను ఆదేశించారు.
అధికారులకు అదనపు కలెక్టర్ లత ఆదేశం
డిచ్పల్లి, జూలై 7: అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ బీఎస్ లత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె మండల ంలోని ధర్మారం(బి), గొల్లపల్లి గ్రామాల్లో జరుగతున్న పనులను అధికారుల తో కలిసి ఆమె పరిశీలించారు. వైకుంఠధామం నిర్మాణ పనులతో పాటు కం పోస్ట్ షెడ్డు నిర్మాణ పనులను త్వరతిగతిన పూర్తి చేయాలని సంబంధిత అ ధికారులు, ప్రజాప్రతినిధులకు ఆమె సూచించారు. గొల్లపల్లి గ్రామంలో ఇసు క లేక నిలిచిపోయిన వైకుంఠధామం పనులను వారం రోజుల్లో పూర్తి చేయా లని ఆమె అధికారులను ఆదేశించారు.
అన్ని గ్రామాల్లో జరుగుతున్న అభివృ ద్ధి పనుల వివరాలను సమాచారం ఇవ్వాలని ఎంపీడీవో సురేందర్, ఎంపీవో రామకృష్ణలకు సూచించారు. గ్రామంలో హరితహారం మొక్కల కార్యక్రమా న్ని సమిష్టిగా చేపట్టి విజయవంతం చేయాలన్నారు. అనంతరం గొల్లపల్లిలో ఏర్పాటు చేసిన నర్సరీని ఆమె పరిశీలించారు. అన్ని గ్రామాల్లో లక్ష్యానికి మిం చి మొక్కలు నాటి హరితహారంను జిల్లాలో ముందువరుసలో ఉంచాలన్నా రు. ఆమెవెంట సర్పంచ్లు మమత, లింగం, కార్యదర్శులు ఉన్నారు.