అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వాలి

ABN , First Publish Date - 2020-09-17T11:12:33+05:30 IST

నిజామాబాద్‌ కా ర్పొరేషన్‌ పరిధిలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని నిజామాబాద్‌ అర్బన్‌

అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వాలి

అసెంబ్లీలో నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా 


నిజామాబాద్‌ (ఆంద్రజ్యోతి ప్రతినిధి) సెప్టెంబరు 16 : నిజామాబాద్‌ కా ర్పొరేషన్‌ పరిధిలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా ప్రశ్నోత్తరాల సమయంలో సీఎం దృష్టికి తీసుకవచ్చారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ పర్యటనల సమ యంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా నిధులు విడుదల అయ్యాయని అ న్నారు. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు పూర్తి చేశామని తెలిపారు. పనులు చేసే సమయంలో రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. కొన్నిచోట్ల వేసిన మరికొన్ని చో ట్ల వేయాలని ఉందని, వాటికి నిధులు విడుదల చేస్తే పనులు త్వరగా పూర్తి అవుతాయన్నారు. నిజామాబాద్‌ మాదిరిగానే ఇతర మున్సిపాలిటీల్లో భూగ ర్భ డ్రైనేజీ పనులు చేయాలన్నారు. ఐటీ పరిశ్రమలు నిజామాబాద్‌తో పాటు కరీంనగర్‌లో ఏర్పాటు చేయాలని కోరారు.

Updated Date - 2020-09-17T11:12:33+05:30 IST