అభివృద్ధి పనుల పరిశీలన
ABN , First Publish Date - 2020-11-23T04:23:34+05:30 IST
దహెగాం మండలంలోని ఇట్యాల, బోర్లకుంట, కోత్మీర్, బీబ్రా, ఐనం, దహెగాం గ్రామాల్లోని రైతు వేదికలు, వ్మశాన వాటికలు, డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనాలను ఆదివారం జడ్పీ సీఈఓ సాయగౌడ్ పరిశీలించారు.
దహెగాం, నవంబరు 22: దహెగాం మండలంలోని ఇట్యాల, బోర్లకుంట, కోత్మీర్, బీబ్రా, ఐనం, దహెగాం గ్రామాల్లోని రైతు వేదికలు, వ్మశాన వాటికలు, డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనాలను ఆదివారం జడ్పీ సీఈఓ సాయగౌడ్ పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు వేదికల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఆయన వెంట డీపీఓ రమేష్, పీడీ వెంకటశైలేష్, ఎంపీడీఓ సత్యనారాయణగౌడ్, ఎంపీఓ రాజేశ్వర్గౌడ్, సర్పంచ్లు మురారి, మధుకర్, బండ కృష్ణ, జయేందర్, లక్ష్మి, టీఏలు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.