అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ABN , First Publish Date - 2021-06-22T04:27:06+05:30 IST

మండలంలోని నార్తురాజుపాలెంలో సెంట్రల్‌ లైటింగ్‌, డ్రెయిన్ల అభివృద్ధి పనులకు సోమవారం ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, కలెక్టర్‌ చక్రధర్‌బాబు శంకుస్థాపన చేశారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, కలెక్టర్‌ చక్రధర్‌బాబు

కొడవలూరు, జూన్‌ 21 : మండలంలోని నార్తురాజుపాలెంలో సెంట్రల్‌ లైటింగ్‌, డ్రెయిన్ల అభివృద్ధి పనులకు సోమవారం ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, కలెక్టర్‌ చక్రధర్‌బాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని మారుమూల గ్రామాలు సైతం అభివృద్ధికి కృషి చేస్తున్నామని, పేదల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్‌ చైర్మన్‌ వీరి చలపతిరావు, రాష్ట్ర ఆప్కాప్‌ చైర్మన్‌ కొండూరు అనిల్‌ బాబు, అధికారులు పాల్గొన్నారు. 


రూ.9.45కోట్లతో తాటిపర్తి అభివృద్ధి 

పొదలకూరు(రూరల్‌) : మండల పరిధిలోని తాటిపర్తి పంచాయతీ అభివృద్ధి కోసం రూ.9.45కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. పంచాయతీ పరిధిలోని నల్లపాళెంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో  దీర్ఘ కాలంగా ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రాంత ప్రజల కోసం ఎమ్మెల్యేగా కాక మీ ఇంటి బిడ్డగా పనిచేస్తానని ఆయన వివరించారు. కార్యక్రమంలో పోలిరెడ్డి గోగిరెడ్డి, నిర్మలమ్మ, శ్రీనివాసులురెడ్డి, తదితరులు పాల్గొన్నారు.   

Updated Date - 2021-06-22T04:27:06+05:30 IST