ఇందిరా శోభన్‌ పార్టీని వీడినా పార్టీకి నష్టమేమి లేదు: దేవేందర్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-08-21T21:50:42+05:30 IST

ఇందిరా శోభన్‌ పార్టీని వీడినా పార్టీకి నష్టమేమి లేదని వైఎస్సార్‌ టీపీ నేత దేవేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో

ఇందిరా శోభన్‌ పార్టీని వీడినా పార్టీకి నష్టమేమి లేదు: దేవేందర్‌రెడ్డి

హైదరాబాద్: ఇందిరా శోభన్‌ పార్టీని వీడినా పార్టీకి నష్టమేమి లేదని వైఎస్సార్‌ టీపీ నేత దేవేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీలో చేరికలు, వెళ్లిపోవడం సహజమన్నారు. ప్రాధాన్యత పరంగా ఇందిరా శోభన్‌కు ఎక్కడా తక్కువ చేయలేదని, సముచిత స్థానం కల్పించినా ఇందిరా శోభన్ పార్టీని వీడారని విమర్శించారు. కార్యకర్తలను నాయకులుగా తయారు చేసుకోవాలన్నదే తమ లక్ష్యమని దేవేందర్‌రెడ్డి ప్రకటించారు. వైఎస్సార్‌ టీపీలో కీలక నేతగా ఉన్న ఇందిరా శోభన్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు పంపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల అభీష్టం మేరకు రాజీనామా చేస్తున్నట్లు ఇందిరా శోభన్ తెలిపారు.

Updated Date - 2021-08-21T21:50:42+05:30 IST