దేవీపట్నంచుట్టూ వరదే..

ABN , First Publish Date - 2021-06-23T07:03:39+05:30 IST

మళ్లీ వరద తాకిడి మొదలైంది. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వాగులకు వరద నీరు చేరడంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి.

దేవీపట్నంచుట్టూ వరదే..

దేవీపట్నంలో  వాగు దాటి వస్తున్న గ్రామస్తులు
దేవీపట్నం, జూన్‌ 22: మళ్లీ వరద తాకిడి మొదలైంది. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వాగులకు వరద నీరు చేరడంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. ముఖ్యంగా దేవీపట్నం మండల కేంద్రం నుంచి మైదాన ప్రాంతాలకు వెళ్లేందుకు రాకపోకలు మంగళవారం ఉదయం నుంచి నిలిచిపోయాయి. పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న పలు గ్రామాల ప్రజలు తమ సామగ్రిని తరలించేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాగా దేవీపట్నంలో వరద పరిస్థితిని ఆర్డీవో శీనానాయక్‌ పరిశీలించారు. ఆయన వెంట తహశీల్దార్‌ వీర్రాజు ఉన్నారు.



Updated Date - 2021-06-23T07:03:39+05:30 IST