థియేటర్ ప్రారంభం.. గులాబీలతో ప్రేక్షకులకు స్వాగతం
ABN , First Publish Date - 2020-12-05T11:56:25+05:30 IST
దేవి 70ఎంఎం సినిమా థియేటర్ను
హైదరాబాద్/చిక్కడపల్లి : ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని దేవి 70ఎంఎం సినిమా థియేటర్ను శుక్రవారం తిరిగి ప్రారంభించారు. కొవిడ్ నేపథ్యంలో గత మార్చి 18 నుంచి రాష్ట్రంలోని అన్ని థియేటర్లు మూతపడ్డాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు సడలింపుతో శుక్రవారం నుంచి నగరంలోని కొన్ని థియేటర్లను నిర్వాహకులు పునఃప్రారంభించారు. సినిమా చూసేందుకు వచ్చిన ప్రేక్షకులకు సినిమా థియేటర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో గులాబీపూలు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవాధ్యక్షుడు ఎన్.మారన్న మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్లు రీఓపెన్ చేసి కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత థియేటర్ల ఓనర్లపై ఉందన్నారు.