జగన్‌ను ప్రశ్నించిన దేవినేని

ABN , First Publish Date - 2021-08-15T20:35:00+05:30 IST

కృష్ణా జిల్లాలో అక్రమంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

జగన్‌ను ప్రశ్నించిన దేవినేని

అమరావతి: కృష్ణా జిల్లాలో అక్రమంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్వీట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘కృష్ణా నదీగర్భంలో ప్రొక్లైన్‌లు పెట్టి వందలాది లారీలతో లక్షల టన్నుల ఇసుక దోపిడికి పాల్పడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా నదిలో మెటల్ రోడ్లు వేస్తున్నారు. అర్ధరాత్రివేళ ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్నారు. మీ నేతల జేబులు నింపేందుకు ప్రజల ప్రాణాలను ఫణంగా పెడతారా? చెవిటికల్లు నుండి నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న మీ నేతలపై చర్యలేవి? వైఎస్ జగన్’’ అంటూ దేవినేని ట్వీట్ చేశారు. 

Updated Date - 2021-08-15T20:35:00+05:30 IST